Narendra Modi: ఈ నెల 29న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన

PM Modi will visit Visakha on Nov 29

  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మోదీ
  • విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ
  • ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రసాద్

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారు. ఈ నెల 29న ఆయన విశాఖలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో, బహిరంగ సభకు హాజరుకానున్నారు. ప్రధాని వస్తుండడంతో, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. 

సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్ లో మోదీ సభ ఏర్పాటు చేశారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఈ సభ నుంచి మోదీ శంకుస్థాపన చేయనున్నారు.

Narendra Modi
Visakhapatnam
BJP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News