PM Modi: సబర్మతి రిపోర్ట్ సినిమాపై ప్రధాని మోదీ సంచలన ట్వీట్

PM Modis Post On The Sabarmati Report Movie

  • సామాన్యులకు నిజం తెలిసేలా చేశారని సినిమా టీమ్ ను మెచ్చుకున్న మోదీ
  • తప్పుడు ప్రచారం కొన్ని రోజులు మాత్రమే సాగుతుందని వెల్లడి
  • ఎప్పటికైనా నిజం బయటపడుతుందని చెప్పిన ప్రధాని

అసత్య ప్రచారం ఎక్కువ కాలం ఉండదని, ఎప్పటికైనా నిజం బయటపడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశాడు. గోద్రా అల్లర్ల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘సబర్మతి రిపోర్ట్’ ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా టీమ్ ను మెచ్చుకున్నారు. నిజం బయటకు రావడం చాలా మంచి విషయం, అది కూడా సామాన్యులకు తెలిసే పద్ధతిలో చూపించడం మంచి ప్రయత్నమని కొనియాడారు. ఈమేరకు అలోక్ భట్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ మోదీ ఈ కామెంట్ చేశారు.

సబర్మతి రిపోర్ట్ సినిమా గత శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. గోద్రా అల్లర్ల ఇతివృత్తంగా రూపొందించిన ఈ సినిమాలో విక్రాంత్ మాసే నటించారు. గోద్రా రైల్వే స్టేషన్ లో ట్రైన్ కు నిప్పు పెట్టడంతో 59 మంది సజీవదహనం కావడం, దీంతో రాష్ట్రంలో అల్లర్లు చెలరేగడం తదితర సంఘటనలను ఇందులో చూపించారు. నరేంద్ర మోదీ అప్పట్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. గోద్రా ఘటనతో గుజరాత్ లో చెలరేగిన హింస వల్ల దాదాపుగా వెయ్యి మందికి పైగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనలకు సంబంధించి సినిమాలో కొత్త విషయాలను చూపించినట్లు మూవీ టీమ్ వెల్లడించింది. ఈ సినిమాకు ధీరజ్ శర్మ దర్శకత్వం వహించగా ఏక్తాకపూర్ నిర్మాతగా వ్యవహరించారు.

PM Modi
Narendra Modi
Sabarmati Report
Movie
Modi Tweet

More Telugu News