Rohit Sharma: పెర్త్ టెస్టుకు రోహిత్ శర్మ దూరం

Rohit Sharma likely not playing first test

  • ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ అర్ధాంగి
  • మరికొన్నిరోజుల పాటు భారత్ లోనే ఉండనున్న హిట్ మ్యాన్
  • నవంబరు 22 నుంచి టీమిండియా-ఆసీస్ తొలి టెస్టు

నవంబరు 22 నుంచి టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య పెర్త్ లో మొదటి టెస్టు జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ కు టీమిండియా సారథి రోహిత్ శర్మ దూరం కానున్నాడు. రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కొన్నిరోజుల కిందటే మగబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో రోహిత్ శర్మ జట్టుతో పాటే ఆస్ట్రేలియా వెళ్లలేకపోయాడు. అతడు మరికొన్ని రోజుల పాటు భారత్ లోనే ఉంటాడని తెలుస్తోంది. 

రెండో టెస్టుకు ముందు జరిగే వార్మప్ మ్యాచ్ సమయానికి రోహిత్ శర్మ జట్టుతో చేరే అవకాశాలున్నాయి. ఇక, రోహిత్ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో... టీమిండియాకు జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ కు జట్టులో స్థానం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రాక్టీసు మ్యాచ్ లో గాయపడిన కేఎల్ రాహుల్... మళ్లీ మైదానంలోకి దిగడం టీమిండియాకు ఊరటనిచ్చింది.

Rohit Sharma
Perth Test
Team India
Australia
  • Loading...

More Telugu News