Chandrababu: రామ్మూర్తినాయుడుకి నివాళి అర్పించిన చంద్రబాబు, మంచు మనోజ్.. ఫోటోలు ఇవిగో!

Chandrababu pays tributes to Ramamohan Naidu

  • నారావారిపల్లెలో రామ్మూర్తినాయుడు పార్థివదేహం
  • నివాళి అర్పించిన పలువురు నేతలు
  • కాసేపట్లో రామ్మూర్తి అంతిమయాత్ర

తన తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించారు. నారావారిపల్లెలోని తన నివాసం వద్ద ఉంచిన రామ్మూర్తి భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు. ఆయనతో పాటు మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్, నారా లోకేశ్, బ్రాహ్మణి, సినీ నటులు మోహన్ బాబు, మంచు మనోజ్, పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు నివాళి అర్పించారు. 

కాసేపట్లో రామ్మూర్తినాయుడు అంతిమయాత్ర ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. తన తల్లిదండ్రుల అంత్యక్రియలు జరిగిన చోటే రామ్మూర్తినాయుడు అంత్యక్రియలను నిర్వహించనున్నారు.  




Chandrababu
Ramamurthy Naidu
Telugudesam
Mohan Babu
Manchu Manoj
Tollywood
  • Loading...

More Telugu News