Nara Ramamurthy Naidu: చిన్నాన్న భౌతికకాయంతో నారావారిపల్లెకు చేరుకున్న నారా లోకేశ్

Nara Ramamurthy Naidu body reached Naravaripalle

  • హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి భౌతికకాయం తరలింపు
  • కాసేపట్లో నారావారిపల్లెకు చేరుకోనున్న చంద్రబాబు
  • మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు

ఏపీ ముఖ్యమంత్రి సోదరుడు నారా రామ్మూర్తినాయుడు పార్థివదేహం ఆయన స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుంది. మంత్రి నారా లోకేశ్ తన చిన్నాన్న భౌతికకాయాన్ని దగ్గురుండి తీసుకొచ్చారు. హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రామ్మూర్తి పార్థివదేహాన్ని తిరుపతికి తరలించారు. తిరుపతి నుంచి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు తీసుకొచ్చారు. చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి బయల్దేరారు. కాసేపట్లో ఆయన నారావారిపల్లెకు చేరుకోనున్నారు.

చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్న తర్వాత రామ్మూర్తి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. చంద్రబాబు నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయి. అంత్యక్రియలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొననున్నారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిన్న మధ్యాహ్నం రామ్మూర్తినాయుడు కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న ఉదయం గుండెపోటుకు గురయ్యారు. దీంతో పరిస్థితి పూర్తిగా విషమించి నిన్న మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 

Nara Ramamurthy Naidu
Nara Lokesh
Chandrababu
Telugudesam
  • Loading...

More Telugu News