Pawan Kalyan: చంద్రబాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపిన పవన్ కల్యాణ్

Pawan Kalyan condolences to Chandrababu family

  • రామ్మూర్తినాయుడు మరణ వార్తతో మనోవేదనకు గురయ్యానన్న పవన్
  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం కారణంగా అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని వెల్లడి
  • రామ్మూర్తి మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తినాయుడు మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామ్మూర్తినాయుడు అనారోగ్య సమస్యలతో మరణించారని తెలిసి తీవ్ర మనోవేదనకు గురయ్యానని తెలిపారు. సోదర వియోగంతో బాధపడుతున్న సీఎం చంద్రబాబుకు సానుభూతిని తెలియజేశారు. 

రామ్మూర్తినాయుడి కుమారుడు, సినీ హీరో నారా రోహిత్ కు, కుటుంబసభ్యులకు సంతాపాన్ని తెలియజేస్తున్నానని పవన్ చెప్పారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఉండటం వల్ల అంత్యక్రియలకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. రామ్మూర్తి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. 

రామ్మూర్తి మరణంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... రామ్మూర్తి మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. ఆయన మరణం చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని అన్నారు. రామ్మూర్తినాయుడు కుటుంబసభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆయన సేవలను తెలుగు ప్రజలు ఎప్పుడూ గుర్తుంచుకుంటారని అన్నారు. 

Pawan Kalyan
Janasena
Ayyanna Patrudu
Telugudesam
Ramamurthy Naidu
  • Loading...

More Telugu News