Nara Lokesh: ఏపీలో ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌ర‌మైన ఎకోసిస్ట‌మ్ సిద్ధం.. న్యూయార్క్ పెట్టుబ‌డిదారుల భేటీలో మంత్రి లోకేశ్‌

Minister Nara Lokesh Met Investors in New York

  • భారీగా యువతకు ఉద్యోగాలిచ్చే పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలిస్తామ‌న్న మంత్రి
  • నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ తయారీ ఉంటుంద‌ని వెల్ల‌డి
  • ప్రముఖ పారిశ్రామికవేత్తను కలవడానికి కాలి నడకన వెళ్లిన లోకేశ్‌

ఏపీలో విజనరీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం పరిశ్రమలకు అవసరమైన ఎకోసిస్ట‌మ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు.  యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా అందజేస్తోందన్నారు. అమెరికా పర్యటన చివరిరోజున మంత్రి లోకేశ్‌ న్యూయార్క్ లోని విట్ బై హోటల్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అంతకుముందు న్యూయార్క్ మహానగరంలో బ్యాంక్ ఆఫ్ అమెరికా వైస్ చైర్మన్ పూర్ణ ఆర్ సగ్గుర్తిని కలవడానికి ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా వాహనం వదిలేసి కాలినడకన బయలుదేరి వెళ్లారు. 

అనంతరం పారిశ్రామిక వేత్తలతో భేటీ అయిన మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలో వివిధరంగాల్లో పెట్టుబడులకు గల అవకాశాలను మంత్రి వివరించారు. బ్లూప్రింట్ తో వచ్చే పరిశ్రమలకు ఎటువంటి జాప్యం లేకుండా వెనువెంటనే అనుమతులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు భారత్ లో ఏ రాష్ట్రంలో లేని అనుకూల వాతావరణం ఏపీలో ఉంద‌న్నారు. 974 కిమీల సువిశాల తీరప్రాంతానికి అనుసంధానంగా రోడ్డు, ఎయిర్ కనెక్టివిటీ అందుబాటులో ఉంద‌ని పేర్కొన్నారు. 

రాబోయే 18 నెలల్లో విశాఖ సమీపంలోని భోగాపురంవద్ద జీఎంఆర్ సంస్థ నేతృత్వంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంద‌ని తెలిపారు. దీంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారిపోతుంద‌న్నారు. దీంతో పాటు రాష్ట్రంలో మూలపేట, కాకినాడ గేట్ వే, మచిలీపట్నం, రామాయపట్నంలలో 4 కొత్త పోర్టులు అందుబాటులోకి వస్తాయ‌ని తెలిపారు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఆయా పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా మానవవనరులను సిద్ధం చేసేందుకు దేశంలోనే తొలిసారిగా స్కిల్ సెన్సస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన‌ట్టు తెలిపారు. 

దీనిద్వారా పరిశ్రమలకు అవసరమయ్యే మ్యాన్ పవర్ అందుబాటులోకి తెస్తామ‌న్నారు. పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా యూనివర్సిటీలు, కళాశాలల్లో విద్యతోపాటు యువతకు ప్రత్యేకమైన  నైపుణ్య శిక్షణ ఇచ్చేలా వచ్చే ఏడాది నుంచి కరిక్యులమ్‌లో మార్పులు చేయబోతున్నామ‌ని తెలిపారు. అమరావతిలో ఏర్పాటుచేయబోయే ఏఐ యూనివర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఏఐ నిపుణులు తయారవుతార‌ని చెప్పారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెడుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. పెట్టుబడులకు అన్నివిధాలా అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా లోకేశ్‌ అమెరికా పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేశారు.   

ఈ సమావేశంలో టామ్ ప్రాంకో (సీనియర్ అడ్వయిజర్, సిడి & ఆర్), టాడ్ రప్పర్ట్ (సీఈఓ, రప్పర్ట్ ఇంటర్నేషనల్), ఎరిక్ గెర్ట్లర్ (ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్‌ సీఈఓ, యూఎస్ న్యూస్ అండ్‌ వరల్డ్ రిపోర్ట్, రాబర్ట్ టిచియో (సీఈఓ, ఫోర్టెస్క్ క్యాపిటల్, సంజయ్ పటేల్ (వైస్ చైర్మన్, అపోలో క్యాపిటల్), రిచర్డ్ డ్రెస్డేల్ ( సీనియర్ ఎండి, మెడి మేడిసన్ రివర్ క్యాపిటల్), కెన్ నోవాక్ (ఎండీ, అలెక్చ్ బ్రౌన్ అండ్‌ రేమండ్ జేమ్స్), సుసాన్ ఫోర్సింగ్డల్ (ఎండీ, ఎలయెన్స్ క్యాపిటల్), డ్యానీ ఫ్రాంక్లిన్ (పార్టనర్, బుల్లీ పల్పిట్ ఇంటర్నేషనల్), థామస్ పొంపిడో (పార్టనర్ అండ్‌ ఫౌండర్, మార్కర్ ఎల్ఎల్‌సీ), జిమ్ ఊలెరి (ఫౌండింగ్ పార్టనర్, ఊలెరి అండ్‌ కో), మిచైల్ డబ్లియర్ (ఫౌండర్, డబ్లియర్ అండ్‌ కంపెనీ), జెఫ్ న్యూక్ టెర్లీన్ (మేనేజింగ్ పార్టనర్, న్యూ క్యాపిటల్), ధ్రువ్ గోయల్ (సీఈఓ, ఫోర్ లయన్ క్యాపిటల్), నిఖిల్ సిన్హా (సీఈఓ, వన్ వ్యాలీ), సన్ గ్రూప్ వైస్ చైర్మన్ శివ్ ఖేమ్కా, ఎండీ వైద్యనాథన్ శివకుమార్, డైరక్టర్లు జయశ్రీ ఖేమ్కా, ఇలినా దూబే పాల్గొన్నారు.

Nara Lokesh
New York
Investors
Andhra Pradesh
  • Loading...

More Telugu News