Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... ఆరుగురు మృతి... చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu shocked as fatal road accident killed six people in Anantapur district

  • లారీ కిందికి దూసుకెళ్లి నుజ్జునుజ్జయిన కారు
  • తాడిపత్రిలో ఇస్కాన్ నగర సంకీర్తన నుంచి తిరిగొస్తుండగా ఘటన
  • మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు
  • బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శింగనమల మండలం నాయనపల్లి క్రాస్ వద్ద లారీని కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. వేగంగా ప్రయాణిస్తున్న కారు లారీ కిందికి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు నుజ్జునుజ్జు అయింది. 

మృతులు అనంతపురం ఇస్కాన్ ప్రార్థన మందిరం భక్తులుగా గుర్తించారు. వారు తాడిపత్రి నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా, ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 

కాగా, అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

  • Loading...

More Telugu News