Allu arjun: ఆ హీరోతో సినిమా తరువాతే 'పుష్ప-3' చిత్రానికి శ్రీకారం!

After the film with that hero the film Pushpa 3 will be launched

  • పుష్ప-3 చిత్రాన్ని కన్‌ఫర్మ్‌ చేసిన నిర్మాతలు 
  • త్రివిక్రమ్‌తో సినిమా తరువాతే పుష్ప-3 అంటోన్న అల్లు అర్జున్‌ 
  • పుష్ప-2 తరువాత రామ్‌చరణ్‌తో సినిమా చేయనున్న సుకుమార్‌

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందిన పుష్ప ది రైజ్‌ విజయం సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులను అలరించింది. ముఖ్యంగా ఆ చిత్రంలో పుష్పరాజ్‌ మేనరిజంతో కూడిన "తగ్గేదెలే" అనే డైలాగ్‌ ఎంత పాపులారిటీని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

ఇప్పుడు పుష్పకు సీక్వెల్‌గా సేమ్‌ కలయికలో పుష్ప-2 ది రూల్‌ తెరకెక్కుతోంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరిదశలో వున్న ఈ చిత్రం మరో వైపు నిర్మాణానంతర పనులను కూడా శరవేగంగా జరుపుకుంటోంది. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఇటీవల ఈ పుష్ప-2 చిత్ర నిర్మాతలు హైదరాబాద్‌లో ఓ పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా పుష్ప-2కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. పుష్ప-3 కూడా కచ్చితంగా ఉంటుందని నిర్మాతలు ఇదే వేదికపై పేర్కొన్నారు. దీనికి సంబంధించిన లీడ్‌ పుష్ప-2 ఎండింగ్‌లో ఉంటుందని చెప్పి సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు. 

అయితే పుష్ప-3 సెట్స్‌మీదకు వెళ్లే కంటే ముందు అల్లు అర్జున్... త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తారు. దర్శకుడు సుకుమార్‌ కూడా రామ్‌చరణ్‌తో ఓ సినిమాను చేయాల్సి ఉంది. రంగస్థలం తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా గతంలో వెలువడింది. సో.. అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఇద్దరూ కూడా చెరో సినిమా పూర్తిచేసిన తరువాతే పుష్ప-3 సెట్స్‌ మీదకు వెళుతుంది. 

  • Loading...

More Telugu News