Amaravati Railway Line: పవన్ కల్యాణ్, చంద్రబాబు చొరవ పట్ల అభినందిస్తున్నా: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

VV Lakshminarayana appreciates Pawan Kalyan and Chandrababu

  • అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ కేటాయించిన కేంద్రం
  • రణస్థలం ప్రాంతానికి ఎలివేటెడ్ కారిడార్
  • నేడు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

అమరావతి అనుసంధాన రైల్వే లైన్ తో పాటు రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును కేటాయిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. అమరావతికి ప్రత్యేక రైల్వే లైన్ ను సాధించడంలో పవన్ కల్యాణ్, చంద్రబాబు చూపిన చొరవ అభినందనీయం అని పేర్కొన్నారు. 

అమరావతి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టు, రణస్థలం ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు ఏపీ అనుసంధానానికి, మౌలిక సదుపాయాల రంగానికి గణనీయంగా ఊతమిస్తాయని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు గుణాత్మక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. ఈ మేరకు లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News