Pune Test: పూణే టెస్టులో టాస్ పడింది.. భారత జట్టులో మూడు మార్పులు

New Zealand opt to bat first in Pune Test against India

  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
  • జట్టులో మూడు కీలక మార్పులతో బరిలోకి దిగిన టీమిండియా
  • తుది జట్టులో సిరాజ్, కేఎల్ రాహుల్, కుల్దీప్‌లకు దక్కని చోటు
  • ఆకాశ్ దీప్, సుందర్, శుభ్‌మాన్ గిల్‌లకు చోటు

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో కీలకమైన రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ టామ్ లాథమ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆతిథ్య భారత్‌కు ఫీల్డింగ్ అప్పగించాడు.  

ఈ మ్యాచ్‌లో మూడు కీలక మార్పులతో టీమిండియా బరిలోకి దిగింది. జట్టులో మూడు మార్పులు చేశామని కెప్టెన్ రోహిత్ వెల్లడించారు. పేసర్ మహ్మద్ సిరాజ్, మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను పక్కన పెట్టి పేసర్ ఆకాశ్ దీప్, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించాడు. ఇక న్యూజిలాండ్ జట్టులో ఒకే ఒక్క మార్పు జరిగింది. మాట్ హెన్రీ స్థానంలో సాంట్నర్‌ను తిరిగి జట్టులోకి తీసుకున్నారు.

తుది జట్లు ఇవే..
భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్: టామ్ లాథమ్ (కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే.

రోహిత్ ఏమన్నాడంటే..
కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాళ్లమని చెప్పాడు. ‘‘తొలి టెస్టులో మొదటి సెషన్ మాకు సానుకూలంగా సాగలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో మేము బాగానే పుంజుకొని బ్యాటింగ్ చేశాం. దాని నుంచి చాలా సానుకూల అంశాలను నేర్చుకున్నాం. ఆ విషయాలను ఈ మ్యాచ్‌లో ఏ విధంగా ఉపయోగించుకోగలమో చూడాలి. సిరీస్‌లో వెనుకబడి ఉన్నప్పుడు తిరిగి పుంజుకోవడానికి మార్గాలను అన్వేషిస్తుంటారు. మేము కూడా అదే చేస్తాం. ఇక పిచ్ కొంచెం పొడిగా అనిపిస్తోంది. తొలి 10 ఓవర్లు ఎంత కీలకంగా మారతాయో చూడాలి’’ అని రోహిత్ శర్మ అన్నాడు.

  • Loading...

More Telugu News