Nayanthara: భర్తకు థ్యాంక్స్ చెప్పిన నయనతార

Nayanthara thanks her husband

  • తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న 'నేను రౌడీనే' సినిమా
  • ఈ సినిమా ద్వారా పరిచయమైన నయన్, విఘ్నేశ్
  • ఈ చిత్రం తనకు విఘ్నేశ్ ను ఇచ్చిందన్న నయనతార

సినీ ఇండస్ట్రీలో అన్యోన్యమైన జంటల్లో నయనతార - విఘ్నేశ్ శివన్ ల జోడీ ఒకటి. 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్న ఈ జంటకు ఉయిర్, ఉలగమ్ అనే ట్విన్స్ ఉన్నారు. 'నేను రౌడీనే' చిత్రం వీరిద్దరినీ కలిపింది. నయనతార, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ చిత్రం విడుదలై 9 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాకు విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా తన భర్తకు నయనతార థ్యాంక్స్ చెప్పారు. 

ఈ సినిమా తన జీవితాన్ని మార్చేసిందని నయన్ తెలిపారు. తొమ్మిదేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం తనకు ఎన్నో అనుభవాలను ఇచ్చిందని చెప్పారు. ఇంత గొప్ప చిత్రంలో నటించే అవకాశం ఇచ్చినందుకు విఘ్నేశ్ కు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని అన్నారు. ముఖ్యంగా ఈ చిత్రం తనకు విఘ్నేశ్ ను ఇచ్చిందని చెప్పారు. 

2015లో 'నేను రౌడీనే' సినిమా విడుదలయింది. ఏడాది పాటు ఈ సినిమా షూటింగ్ కొనసాగింది. సినిమా షూటింగ్ సమయంలోనే నయన్, విఘ్నేశ్ స్నేహితులయ్యారు. ఆ తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. 2021లో వీరి ప్రేమను మీడియా ముందు చెప్పారు. 

  • Loading...

More Telugu News