Kaun Banega Crorepati: 'కేబీసీ'లో అల్లు అర్జున్‌పై ప్రశ్న.. ఇంత‌కీ ఏం అడిగారంటే..!

Quetion on Allu Arjun in Kaun Banega Crorepati

  • అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా కేబీసీ 16వ సీజ‌న్‌
  • ఇటీవ‌లే ఈ షోలో పవన్ కల్యాణ్ గురించి కంటెస్టెంట్‌కు ప్రశ్న
  • ఇప్పుడు '2023లో నేషనల్‌ అవార్డు గెలుచుకున్న నటుడు ఎవరు?' అంటూ బ‌న్నీపై ప్ర‌శ్న‌  

బాలీవుడ్ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా ఉన్న టెలివిజన్‌ షో కౌన్‌ బనేగా కరోడ్‌పతి (కేబీసీ) ప్రస్తుతం 16వ సీజన్ నడుస్తోంది. ఈ షోలో భాగంగా ఇటీవ‌ల ఏపీ డిప్యూటీ సీఎం, న‌టుడు పవన్ కల్యాణ్ గురించి కంటెస్టెంట్‌కు ఓ ప్రశ్న వేసిన విష‌యం తెలిసిందే. 

ఇప్పుడు ఇదే షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కూడా అమితాబ్ బ‌చ్చ‌న్‌ ఓ ప్రశ్నను అడిగారు. '2023లో జాతీయ ఉత్త‌మ నటుడు అవార్డు గెలుచుకున్న యాక్ట‌ర్‌ ఎవరు?' అనేది ఆ ప్ర‌శ్న‌. దానికి కంటెస్టెంట్ అల్లు అర్జున్ అని సరైన సమాధానం చెప్పారు. దాంతో రూ.20 వేలు గెలుచుకున్నారు.

కాగా, బ‌న్నీ గ‌తేడాది 'పుష్ప' సినిమాలో న‌ట‌న‌కు గాను నేషనల్‌ అవార్డు గెలుచుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం పుష్ప సీక్వెల్ 'పుష్ప‌-2' తెర‌కెక్కుతోంది. డిసెంబ‌ర్ 6న సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

  • Loading...

More Telugu News