NDA Meeting: ప్రధాని మోదీ అధ్యక్షతన ఎన్డీయే సమావేశం... హాజరైన చంద్రబాబు, పవన్ కల్యాణ్

Chandrababu and Pawan Kalyan attends NDA meet chaired by PM Modi

  • ఛండీగఢ్ లో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం
  • పలు కీలక అంశాలపై చర్చ
  • చంద్రబాబు, పవన్ లో ఉల్లాసంగా మాట్లాడిన మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఛండీగఢ్ లో నేడు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. 

కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు హాజరైన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. త్వరలో జరగనున్న మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ సమావేశం సందర్భంగా చంద్రబాబు, పవన్ లతో ప్రధాని మోదీ ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి.

  • Loading...

More Telugu News