Telangana: ఈ నెల 21 నుంచి దక్షిణ కొరియా పర్యటనకు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు

TG ministers and MLAs to visit Seol from 21 to 24

  • మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి సియోల్ పర్యటన
  • ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు పర్యటన
  • సియోల్ రివర్ ఫ్రంట్ అభివృద్ధిని పరిశీలించనున్న బృందం

మూసీ పునరుజ్జీవంపై అధ్యయనానికి తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు త్వరలో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 21 నుంచి 24 వరకు వారు సియోల్‌లో పర్యటిస్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా పర్యటించనున్నారు. సియోల్‌లో రివర్ ఫ్రంట్ అభివృద్ధిని క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు.

ఈ పర్యటనకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్, 12 మంది ఎమ్మెల్యేలు,  మూసీ రివర్ ఫ్రంట్ ఎండీ దానకిశోర్‌తో పాటు మరో ఆరుగురు అధికారులు కూడా వెళ్లనున్నారు. 

  • Loading...

More Telugu News