Goa: రతన్ టాటా పెంపుడు శునకం ‘గోవా’ నిక్షేపంలా ఉంది: పోలీసుల వివరణ

Is Ratan Tata Pet Dog Goa Dead

  • రతన్ టాటా మరణించిన మూడు రోజులకే ‘గోవా’ మృతి చెందిందంటూ వార్తలు
  • ‘అయ్యో’ అని నిట్టూరుస్తూ నివాళులు
  • వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదన్న పోలీసులు

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా మరణించిన మూడు రోజులకే ఆయన పెంపుడు శునకం ‘గోవా’ కూడా చనిపోయిందన్న వార్త వాట్సాప్‌ గ్రూపులలో తెగ తిరుగుతోంది. ఆ వార్త చూసిన వారు.. ‘అయ్యో’ అని నిట్టూరుస్తున్నారు. యజమాని మృతిని అది జీర్ణించుకోలేకపోయిందని, టాటాతో దానికి అంత బాండింగ్ ఉందంటూ సంతాపం కూడా ప్రకటిస్తున్నారు. మనుషుల కంటే శునకాలు విశ్వాసపాత్రమైనవని కామెంట్లు పెడుతున్నారు.

వైరల్ అయిన ఈ వాట్సాప్ మెసేజ్‌పై ముంబై పోలీసులు స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని, ‘గోవా’ నిక్షేపంలా ఉందని పేర్కొన్నారు. రతన్ టాటా యువ స్నేహితుడు శంతను నాయుడుని అడిగి ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్టు తెలిపారు. గోవా బాగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పేర్కొన్నారు.  

View this post on Instagram

A post shared by Sudhir Kudalkar (@sudhirkudalkar)

\r\n
  • Loading...

More Telugu News