Akhanda 2: అఖండగా 'తాండవం' చేయనున్న బాలకృష్ణ‌.. 'బీబీ4' పోస్ట‌ర్ విడుద‌ల‌

Akhanda 2 Official Poster Released

  • నాలుగోసారి జతకడుతున్న బాల‌య్య‌, బోయ‌పాటి శ్రీను
  • అఖండ సీక్వెల్‌గా 'అఖండ 2-తాండవం' 
  • ఈ రోజు హైద‌రాబాద్‌లో మూవీ ప్రారంభోత్స‌వం  
  • 14 రీల్స్ సంస్థ నిర్మాణం.. థ‌మ‌న్ సంగీతం

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్ట‌ర్‌ బోయపాటి శ్రీను కాంబో మ‌రోసారి రిపీట్ కానుంది. వీరిద్ద‌రూ ఇప్పుడు నాలుగోసారి జతకట్టనున్నారు. ఈ క్రేజీ కాంబోలో ఇంత‌కుముందు వ‌చ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయిన విష‌యం తెలిసిందే. సింహా, లెజెండ్, అఖండతో బోయ‌పాటి, బాల‌య్య హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఈ మాస్ కాంబో 2021లో వ‌చ్చిన అఖండ సీక్వెల్ కోసం క‌లిసి ప‌నిచేయ‌నున్నారు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఈ రోజు హైద‌రాబాద్‌లో ఈ మూవీ ప్రారంభోత్స‌వం ఉంది. ఈ నేప‌థ్యంలో నిర్మాణ సంస్థ 14 రీల్స్ తాజాగా సినిమా టైటిల్‌తో పాటు పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది.  

'అఖండ 2-తాండవం' పేరుతో మూవీ తెర‌కెక్క‌నున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట అఖండ-2ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. బాలకృష్ణ కుమార్తె తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందించడానికి మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News