AP Govt: టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు సీఐడీకి అప్పగింత

AP Govt decides to hand over cases of attacks on TDP office and Chandrababu residence

  • కేసుల విచారణ వేగవంతం చేసేందుకు వీలుగా సీఐడీకి కేసుల బదలాయింపు
  • ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పీఎస్ ల పరిధిలో కేసుల దర్యాప్తు
  • రేపు సీఐడీకి ఈ కేసుల ఫైళ్లు అప్పగించనున్న మంగళగిరి డీఎస్పీ

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తోంది. ఈ కేసుల విచారణ వేగవంతం చేయడానికి సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతోంది. తాజాగా ప్రభుత్వం నిర్ణయం నేపథ్యంలో, ఈ కేసుల విచారణను సీఐడీకి బదిలీ చేయనున్నారు. రేపు (అక్టోబరు 14) ఈ కేసుల ఫైళ్లను మంగళగిరి డీఎస్పీ సీఐడీకి అప్పగించనున్నారు.

  • Loading...

More Telugu News