Mahesh Babu: మహేశ్-రాజమౌళి సినిమా గురించి మరో క్రేజీ అప్‌డేట్‌ లీక్‌!

Another crazy update about Mahesh Rajamoulis movie is leaked

  • ఎస్‌ఎస్‌ఎంబీ29 అప్‌డేట్‌ను లీక్‌ చేసిన రచయిత 
  • ఈ సినిమా సరికొత్త అవతారంలో మహేశ్  
  • ఇండియన్‌ సినిమాలో ఎవరూ టచ్‌ చేయని కథతో మహేశ్ సినిమా

మహేశ్-రాజమౌళి కలయికలో సినిమా రావాలని మహేశ్ అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత రాజమౌళి తదుపరి చిత్రం మహేశ్ తోనే చేస్తున్నారని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం కోసం మహేశ్ సరికొత్త మేకోవర్‌లో వుండగా, దర్శక ధీరుడు స్క్రిప్ట్‌ వర్క్‌లో నిమగ్నమై వున్నాడు. 

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్రం కథాంశం గురించి అప్‌డేట్‌ ఇచ్చిన కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌.. ఈ క్రేజీ కాంబో సినిమాపై మరో అప్‌డేట్‌ను లీక్‌ చేశారు. మాస్టర్‌ క్లాస్‌బై విజయేంద్రప్రసాద్‌ అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కానుందని చెప్పడంతో పాటు ఈ కథను తయారుచేయడానికి రెండు సంవత్సరాల టైమ్‌ పట్టిందని తెలిపారు. 

ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ ప్రతిష్ఠాత్మక భారీ బడ్జెట్‌ చిత్రం గురించి ఈ అప్‌డేట్‌ను తెలుసుకున్న మహేశ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో ట్రెజర్‌ హంట్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం రాజమౌళి క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని విదేశీ భాషల్లో కూడా అనువదించడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అందుకే విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించబోతున్నారని సమాచారం. 

ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని సరికొత్తగా ఆవిష్కరించబోతున్నాడని ఇటీవల విజయేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని దుర్గా ఆర్ట్స్‌ పతాకంపై సీనియర్‌ నిర్మాత కేఎల్‌ నారాయణ నిర్మిస్తారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ రాబోతున్నాయి.

  • Loading...

More Telugu News