Chandrababu: విజయవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

Chandrababu and Lokesh responds over Jyotsna death

  • రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి
  • ఆమె మృతి బాధాకరమన్న చంద్రబాబు
  • విహారయాత్ర విషాద యాత్రగా మారడం బాధాకరమన్న లోకేశ్

రాజస్థాన్‌లో విజయవాడ బార్ అసోసియేషన్ సభ్యులు రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న మృతిపై ఆయన విచారం వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థినులను చైతన్య పరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించిన జ్యోత్స్న మృతి బాధాకరమన్నారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బస్సు ప్రమాదానికి గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన సాయం అందించాలని తన కార్యాలయ అధికారులకు సీఎం సూచించారు.

జ్యోత్స మృతి కలచివేసింది: నారా లోకేశ్ 
మహిళా భద్రత, సాధికారత కోసం ఉద్యమించిన ప్రముఖ సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్ సతీమణి గొల్లపల్లి జ్యోత్స్న రాజస్థాన్‌లో జరిగిన ప్రమాదంలో మృతి చెందడం తీవ్రంగా కలచివేసిందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.‌ ఆమె మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. విహారయాత్ర విషాదయాత్రగా మారడం బాధాకరమని, ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజేంద్ర ప్రసాద్, న్యాయవాదులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.

Chandrababu
Nara Lokesh
Vijayawada Lawyers
Road Accident
  • Loading...

More Telugu News