Team India: తొలి టీ20లో టాస్ గెలిచిన టీమిండియా... 14 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయిన బంగ్లా

Team India won the toss against Bangladesh

  • టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్
  • గ్వాలియర్ లో నేడు తొలి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

టీమిండియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా... నేడు తొలి మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కు గ్వాలియర్ లోని మాధవరావు సింధియా స్టేడియం వేదికగా నిలుస్తోంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ 14 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. 4 పరుగులు చేసి బంగ్లాదేశ్ ఓపెనర్ లిట్టన్ దాస్ ను అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. ఓపెనర్ పర్వేజ్ హుస్సేన్ ఇమాన్ 8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా అర్షదీప్ కే లభించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ స్కోరు 3 ఓవర్లలో 2 వికెట్ నష్టానికి 16 పరుగులు. కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో 3, తౌహీద్ హృదయ్1 పరుగుతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News