PM Modi: దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌ల్లో ఢోలు వాయించిన ప్ర‌ధాని మోదీ.. ఇదిగో వీడియో!

PM Modi Maharashtra Tour

  • దేశ‌వ్యాప్తంగా ఘ‌నంగా దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు
  • ఈరోజు మ‌హారాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ప్ర‌ధాని 
  • దీనిలో భాగంగా పొహ‌ర‌దేవీ ప్రాంతంలోని జ‌గ‌దాంబ ఆల‌యాన్ని సంద‌ర్శించిన మోదీ
  • ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఢోలు వాయించిన ప్ర‌ధాని

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఈ రోజు ఉద‌యం మ‌హారాష్ట్ర పర్య‌ట‌న‌కు వెళ్లారు. దీనిలో భాగంగా నాందేడ్ చేరుకున్న ఆయ‌న‌కు బీజేపీ నేత అశోక్ చ‌వాన్ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ప్ర‌ధాని నేరుగా పొహ‌ర‌దేవీ ప్రాంతానికి వెళ్లారు. 

అక్క‌డ ఉన్న జ‌గ‌దాంబ ఆల‌యాన్ని సంద‌ర్శించారు. అక్క‌డి మూల‌విరాట్ అమ్మ‌వారికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన మోదీ.. ఆల‌యంలో ఏర్పాటు చేసిన ఢోలు మోగించారు. ఆ త‌ర్వాత సంత్ మ‌హారాజ్, రామ్‌రావ్ మ‌హారాజ్ స‌మాధి అయిన చోటును సంద‌ర్శించి నివాళులు అర్పించారు. 

ఇక దేశ‌వ్యాప్తంగా దేవీశ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. గ‌డిచిన మూడురోజులుగా దేశ‌వ్యాప్తంగా అమ్మవారి ఆల‌యాల్లో ఉత్స‌వాలు జ‌రుగుతున్నాయి. దీంతో ఆల‌యాల‌న్నీ భ‌క్తుల‌తో కిటకిటలాడుతున్నాయి.

  • Loading...

More Telugu News