Chandrababu: శ్రీవారికి ఎక్కువసార్లు పట్టువస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు లభించింది: సీఎం చంద్రబాబు

Chandrababu comments in Tirumala

  • తిరుమలలో వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
  • స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు
  • ఇక్కడ గోవింద నామస్మరణ తప్ప మరేమీ ఉండకూడదని స్పష్టీకరణ 

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో, దేశంలో, విదేశాల్లో ఉండే హిందువులందరికీ అభినందనలు తెలిపారు. ఈ రోజు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయని వెల్లడించారు. 

ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు జరుగుతాయని, స్వామివారు వివిధ రకాల వాహనాల్లో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తిరుగుతారని చంద్రబాబు వివరించారు. వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఒక పవిత్రభావంతో వీక్షిస్తారని పేర్కొన్నారు. 

కలియుగ దేవుడు, ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం వెంకటేశ్వరస్వామికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అత్యధిక పర్యాయాలు పట్టు వస్త్రాలు, ఇతర లాంఛనాలు సమర్పించే అదృష్టం తనకు లభించిందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. 

బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజుల్లో 15 లక్షల మంది భక్తులు తిరుమల వస్తారని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్ని రకాల చర్యలు చేపడుతోందని అభినందించారు. ఇక్కడ గోవింద నామస్మరణ తప్ప మరేమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News