Encounter: చత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్... ఏడుగురు మావోల మృతి

Seven maoists died in Chhattisgarh encounter

  • దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో కాల్పుల మోత
  • నెత్తురోడిన అబూజ్ మాఢ్ అటవీప్రాంతం
  • భారీగా ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

కాగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని ఓ అధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News