YS Jagan: వైసీపీ కీల‌క నేత‌ల‌తో జ‌గ‌న్ స‌మావేశం

YS Jagan Meet YSRCP Key Leaders

  • తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు తీర్పు
  • ఈ విష‌య‌మై పార్టీ కీల‌క నేత‌ల‌తో అధినేత జ‌గ‌న్ భేటీ
  • సీనియ‌ర్లు బొత్స, క‌న్న‌బాబు స‌హా ప‌లువురు నేత‌ల హాజ‌రు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ ఆ పార్టీ కీల‌క నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. తాజాగా తిరుమ‌ల ల‌డ్డూ క‌ల్తీ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విష‌యమై వారితో ఆయ‌న చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్లు స‌మాచారం. 

సీనియ‌ర్ నేత‌లు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, క‌న్న‌బాబు స‌హా ప‌లువురు నేత‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. స్వ‌తంత్ర సంస్థతో విచార‌ణ జ‌ర‌పాల‌న్న సుప్రీంకోర్టు ఆదేశాల‌పై స‌మాలోచ‌న‌లు చేస్తున్నారు. 

కాగా, మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు జ‌గ‌న్ మీడియా సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప్రెస్‌మీట్‌లో సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడ‌నున్నారు. ఇక సీఎం చంద్ర‌బాబు సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తించిన విష‌యం తెలిసిందే. స్వతంత్ర సిట్ ఏర్పాటును స్వాగతిస్తున్న‌ట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News