Chandrababu: రేపు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు దంపతులు

CM Chandrababu and Bhuvaneswari will attend Tirumala Brahmotsavams

  • అక్టోబరు 4న తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • తిరుమలలో సీఎం చంద్రబాబు రెండ్రోజుల పర్యటన
  • పెద శేష వాహనం సేవలో పాల్గొననున్న చంద్రబాబు, భువనేశ్వరి 

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం ముస్తాబైంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి  12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

ఈ నేపథ్యంలో, ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు రేపు (అక్టోబరు 4) లాంఛనంగా స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఎల్లుండి (అక్టోబరు 5)న కూడా చంద్రబాబు దంపతులు బ్రహ్మోత్సవాలకు హాజరుకానున్నారు. వారు పెద శేష వాహన సేవలో పాల్గొంటారు.

  • Loading...

More Telugu News