Stock Market: స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు బ్రేక్

markets ends in losses

  • 264 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 37 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 3 శాతానికి పతనమైన పవర్ గ్రిడ్ షేరు విలువ

దేశీయ స్టాక్ మార్కెట్ వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం సూచీలు లాభాల్లోనే ప్రారంభమయ్యాయి. కాసేపు లాభాల్లో కొనసాగి, ఆ తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 264 పాయింట్లు నష్టపోయి 85,571కి పడిపోయింది. నిఫ్టీ 37 పాయింట్లు కోల్పోయి 26,178 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (2.66%), రిలయన్స్ (1.72%), టైటాన్ (1.50%), హెచ్ సీఎల్ టెక్నాలజీస్ (1.31%), బజాజ్ ఫిన్ సర్వ్ (1.10%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.03%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.83%), భారతి ఎయిర్ టెల్ (-1.74%), హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ (-1.65%), కొటక్ బ్యాంక్ (-1.55%).

  • Loading...

More Telugu News