TTD: అన్యమతస్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం... తిరుమలలో బోర్డులు ఏర్పాటు

TTD decides to display boards for non Hindus

  • జగన్ తిరుమల పర్యటన ప్రకటనతో తెరపైకి డిక్లరేషన్ అంశం
  • హిందూయేతరులు పాటించాల్సిన నిబంధనలతో బోర్డులు 
  • టీటీడీ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనన్న సీఎం చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ తిరుమల పర్యటనకు వెళతానని ప్రకటన వెలువడగానే, అన్యమతస్తులు-డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక నిర్ణయం తీసుకుంది.

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే ఇతర మతాల వారి కోసం బోర్డులు ఏర్పాటు చేయనుంది. అన్యమతస్తులు తిరుమల వచ్చినప్పుడు పాటించాల్సిన నియమ నిబంధనలను ఆ బోర్డుల్లో పొందుపరచనున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఏటీసీ సర్కిల్, గోకులం గెస్ట్ హౌస్ వద్ద ఈ బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. 

శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందేనని సీఎం చంద్రబాబు ఇప్పటికే ట్వీట్ చేసిన నేపథ్యంలో... టీటీడీ బోర్డుల ఏర్పాటు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

  • Loading...

More Telugu News