Daggubati Purandeswari: పురందేశ్వరికి కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం

Centre appoints Purandeswari as Commonwealth Parliamentary Steering Committee Chairperson

  • కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా పురందేశ్వరి
  • రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న రాజమండ్రి ఎంపీ
  • నేడు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ

ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పురందేశ్వరి ఈ పదవిలో 2026 వరకు కొనసాగనున్నారు. తాజా నియామకం నేపథ్యంలో, పురందేశ్వరికి కేంద్ర మంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలకు తెరపడినట్టయింది. కాగా, పురందేశ్వరి కామన్వెల్త్ పార్లమెంటరీ కమిటీ భారత ప్రాంతీయ ప్రతినిధిగానూ నామినేట్ అయ్యారు.

  • Loading...

More Telugu News