Tirupati Laddu: నీ ముఖంలో కొంచెమైనా బాధ కనిపించిందా జగన్?: పట్టాభి

TDP Spokesperson Pattabhi take a dig at Jagan

  • తిరుమల లడ్డూ అంశంలో జగన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన పట్టాభి
  • నువ్వు హిందూ ద్రోహివి జగన్ రెడ్డీ అంటూ విమర్శలు
  • ఘోరమైన పాపం జరిగితే తేలిగ్గా మాట్లాడతావా అంటూ ఆగ్రహం

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ రెడ్డి హిందూ ద్రోహి అని మండిపడ్డారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఘోరమైన పాపం చేశారని ధ్వజమెత్తారు. ఇంత జరిగినా నీ ముఖంలో కొద్దిగానైనా బాధ ఉందా జగన్? అయ్యో, ఎంత పాపం జరిగిందని ఒక్కసారైనా అనిపించిందా? అని ప్రశ్నించారు. 

జగన్ ఐదేళ్ల పాలనలో ఎన్నో ఆలయాలు కూల్చేశారని, రామతీర్థంలో రాములవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారని పట్టాభి పేర్కొన్నారు. ఘోరమైన పాపం జరిగితే చాలా తేలిగ్గా మాట్లాడుతున్నాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

"మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు! ఇది కామన్ గా జరుగుతుంటుందండీ అని క్యాజువల్ గా చెబుతావా? హిందూ మతం పట్ల నీకున్న ద్వేష భావాన్ని నీ ఐదేళ్ల పాలనలోనే చూశాం కదయ్యా! నీ పాలనలో ఆలయాలు ధ్వంసం చేస్తుంటే కట్టడి చేశావా, దోషులను శిక్షించావా? తాడేపల్లి కొంపలో కూర్చుని పైశాచిక ఆనందం పొందావు. అందుకే నువ్వు హిందూ వ్యతిరేకివి" అంటూ పట్టాభి విమర్శనాస్త్రాలు సంధించారు.

Tirupati Laddu
Pattabhi
Jagan
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News