Budda Venkanna: మీకు ఇంకా సిగ్గు రాలేదు: విజయసాయిరెడ్డిపై బుద్దా వెంకన్న ఫైర్

Budda Venkanna fires on Vijayasai Reddy

  • జైల్లో ఉండొచ్చిన మీరు మాకు నీతులు చెపుతారా? అంటూ వెంకన్న మండిపాటు
  • మీరు దొంగలు కాదు... గజదొంగలంటూ విమర్శ
  • 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపు చూస్తున్నారని వ్యాఖ్య

అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకు ప్రజలు పరిమితం చేసినా మీకు సిగ్గురాలేదని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న విమర్శలు గుప్పించారు. నీతో పాటు కొడాలి నాని, పేర్ని నాని, దేవినేని అవినాశ్ వంటి వారిని ఏ పార్టీ కూడా చేర్చుకోదని చెప్పారు. నువ్వొక గుంట నక్కవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పుడు లెక్కలు రాసినందుకు నువ్వు 16 నెలలు జైల్లో ఉన్నావు... నువ్వా మాకు నీతులు చెప్పేది? అని ప్రశ్నించారు. 

ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం కాదని... దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బుద్దా వెంకన్న సవాల్ విసిరారు. మీరు ఇంగ్లీష్, హిందీలో ఎందుకు పోస్టులు పెడుతున్నారో అందరికీ తెలుసని అన్నారు. 

వరద బాధితులకు అండగా ఎంతో మంది పారిశ్రామికవేత్తలు స్పందించి రూ. 350 కోట్ల విరాళాలను సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారని... జగన్ అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని నమ్మి ఎవరైనా ఒక్క రూపాయైనా ఇచ్చారా? అని ఎద్దేవా చేశారు. మీరు దొంగలు కాదు... గజ దొంగలని అన్నారు. 

వైఎస్సార్ తో కలిసి నడిచిన బాలినేని, సామినేని ఉదయభాను ఇప్పుడు ఎక్కడున్నారని వెంకన్న ప్రశ్నించారు. సీనియర్లు మీకు ఛీకొట్టి పార్టీ నుంచి బయటకు వస్తున్నా మీకు సిగ్గు రావడం లేదని అన్నారు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది టీడీపీ వైపు చూస్తున్నారని చెప్పారు. మీతో పాటు మీ అధినేత జగన్, మరికొందరు వైసీపీ నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు.

Budda Venkanna
Telugudesam
Vijayasai Reddy
Jagan
YSRCP
  • Loading...

More Telugu News