Vande Bharat Rail: విశాఖ నుంచి చత్తీస్‌గఢ్ వెళ్తున్న వందేభారత్ రైలుపై రాళ్లదాడి.. మూడు కోచ్‌ల అద్దాలు ధ్వంసం

Stones Thrown At Vande Bharat Windows Broken

  • ప్రధాని నేడు ప్రారంభించాల్సిన రైలుపై రాళ్లదాడి
  • ఐదుగురు నిందితుల అరెస్ట్
  • చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్-విశాఖ మధ్య పరుగులు పెట్టనున్న వందేభారత్ రైలు
  • బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద దాడి
  • నేడు మరికొన్ని రైళ్లను ప్రారంభించనున్న మోదీ

చత్తీస్‌గఢ్‌లో వందేభారత్ రైలు ట్రయల్ రన్ జరుగుతుండగా రాళ్లు విసిరిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ - ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం మధ్య నడవనున్న ఈ రైలు శుక్రవారం ఉదయం విశాఖపట్టణం నుంచి వస్తుండగా బగ్‌బహరా రైల్వే స్టేషన్ వద్ద నిందితులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ రైలుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ సీ2-10,  సీ4-1, సీ9-78 కోచ్‌ల అద్దాలు ధ్వంసమయ్యాయి. నిందితులు శివకుమార్ బఘేల్, దేవేంద్ర కుమార్, జీతు పాండే, సన్వానీ, అరుణ్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ రైలుతోపాటు దేశంలోని తొలి వందేభారత్ మెట్రో రైలును కూడా మోదీ ప్రారంభించనున్నారు. ఇది గుజరాత్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌ మధ్య నడవనుంది. అలాగే, 20 కోచ్‌లతో వారణాసి-ఢిల్లీ మధ్య పరుగులు పెట్టనున్న తొలి 20 కోచ్‌ల వందేభారత్ రైలును కూడా మోదీ నేడు ప్రారంభిస్తారు. అలాగే, టాటానగర్-పాట్నా, నాగ్‌పూర్-సికింద్రాబాద్, కొల్హాపూర్-పూణె, ఆగ్రా కంటోన్మెంట్-బెనారస్, పూణె-హుబ్బళ్లి మధ్య నడిచే వందేభారత్ రైళ్లను మోదీ ప్రారంభిస్తారు.

  • Loading...

More Telugu News