Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu arrives Delhi

  • ఈ సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరిన చంద్రబాబు
  • ఎయిర్ పోర్టులో స్వాగతం పలికిన పార్టీ వర్గాలు
  • సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించిన ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సాయంత్రం గన్నవరం నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఆయన కొద్దిసేపటి కిందట హస్తినలో అడుగుపెట్టారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆయనకు పార్టీ వర్గాలు స్వాగతం పలికాయి. అనంతరం, జేఎన్ యూలో కమ్యూనిస్టు అగ్రనేత సీతారాం ఏచూరి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

కాగా, చంద్రబాబు ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నారు. రేపు రాష్ట్రానికి తిరిగిరానున్నారు.

  • Loading...

More Telugu News