Revanth Reddy: నేను అందరికీ నచ్చకపోవచ్చు... కానీ నా హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా!: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy interesting comments towards journalists

  • జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ
  • హైదరాబాదులో కార్యక్రమం
  • ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి
  • జర్నలిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలం పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో జర్నలిస్టులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఓ వ్యక్తిగా నేను మీకు నచ్చకపోవచ్చు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా. ఆ హోదాలో ఉన్న వ్యక్తి మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ప్రజలందరూ కలిసి ఆ హోదా ఇచ్చారు. ఆ హోదాను గౌరవించాల్సిన బాధ్యత పత్రికలకు, పత్రికా యజమానుల ముసుగులో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు ఉండదా? వాళ్లు పాటించనప్పుడు, మేమెందుకు పాటించాలనేది నా ప్రశ్న" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News