Vijayawada Floods: వరద బాధితులకు రూ.120 కోట్ల భారీ విరాళం ప్రకటించిన ఏపీ ఎన్జీవో

AP NGO announces Rs 120 crore assistance to flood victims

  • ఏపీలో ఇటీవల భారీ వర్షాలు 
  • విజయవాడ ప్రాంతంలో వరద బీభత్సం
  • లక్షలాది మందిపై వరద ఎఫెక్ట్
  • ఒక రోజు వేతనాన్ని విరాళం ఇచ్చిన ఏపీ ఉద్యోగులు

ఏపీ ఉద్యోగులు వరద బాధితుల సహాయార్థం భారీ విరాళం ప్రకటించారు. తమ ఒకరోజు వేతనాన్ని వారు విరాళంగా ఇచ్చారు. ఎపీ ఎన్జీవో జేఏసీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.120 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు ఏపీ ఎన్జీవో నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి విరాళం అందజేశారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏపీ ఎన్జీవో జేఏసీని అభినందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వరకు ముందుకు వస్తున్నారని తెలిపారు. వరద బాధితులకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News