Budameru: విజయవాడ బుడమేరుకు మళ్లీ పెరుగుతున్న వరద

flood level increasing in Budameru

  • బుడమేరులో నిన్న వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం
  • ఈరోజు 8 వేల క్యూసెక్కుల ప్రవాహం వచ్చే అవకాశం ఉందన్న అధికారులు
  • గండ్లను పూడ్చే పనులను పర్యవేక్షిస్తున్న లోకేశ్

విజయవాడను చిగురుటాకులా వణికించిన బుడమేరుకు మళ్లీ వరద పెరుగుతోంది. నిన్న బుడమేరులో వెయ్యి క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. కానీ, ఈరోజు వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతం నుంచి 8 వేల క్యూసెక్కుల వరద వస్తుందని అధికారులు తెలిపారు. గండి పడిన చోట ప్రస్తుతం బుడమేరు ప్రవాహం 3 అడుగులకు చేరింది. ఇప్పటికి ఒక గండిని పూడ్చారు. మిగిలిన రెండు గండ్లను పూడ్చే పనులు జరుగుతున్నాయి. పనులను మంత్రులు నారా లోకేశ్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు. గండ్లను పూడ్చే ప్రక్రియను పర్యవేక్షించాలని నిమ్మల రామానాయుడిని లోకేశ్ కోరారు.

Budameru
Vijayawada
Nara Lokesh
telugu
  • Loading...

More Telugu News