Sharmila: నాన్న ఆశయాలే నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయి: షర్మిల

Sharmila pays tributes to her late father YSR

  • నేడు వైఎస్సార్ 15వ వర్ధంతి
  • ఇడుపులపాయలో నివాళులు అర్పించిన షర్మిల
  • ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరకాలం జీవించే ఉంటారంటూ ట్వీట్

ఇవాళ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ వర్ధంతి. ఈ నేపథ్యంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన తండ్రికి నివాళులు అర్పించారు. దీనిపై ఆమె ట్వీట్ చేశారు. 

"మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించాను. ప్రజల గుండెల్లో చెరగని సంతకం చేసిన గొప్పనేత వైఎస్సార్. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా నాన్న మన మధ్య లేకపోయినా, ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే ఉంటారు. నాన్న ఆశయాలే... లక్ష్య సాధన దిశగా నన్ను చేయి పట్టి నడిపిస్తున్నాయి" అని షర్మిల పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News