Landslide: విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు... సమాచార కేంద్రం ధ్వంసం

Landslides at Indrakeeladri in Vijayawada

 


విజయవాడను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలతో విజయవాడలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. మొగల్రాజపురంలో కొండచరియలు విరిగిపడి నలుగురు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. 

తాజాగా, విజయవాడలో ఇంద్రకీలాద్రిపైనా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో దేవస్థానానికి చెందిన సమాచార కేంద్రం ధ్వంసమైంది. పెద్ద బండరాళ్లు, ఒక్కసారిగా జారిపడడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News