Bigg Boss: బిగ్ బాస్ సీజన్-8 కంటెస్టెంట్స్ వీళ్లేనా...?

bigg boss telugu 8 final contestants rumoured list

  • బిగ్ బాస్ సీజన్ 8కి కౌంట్ డౌన్ ప్రారంభం  
  • ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో 
  • కంటెస్టెంట్లుగా ఊహించని వ్యక్తులు

తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ రియాలిటీ షో బాగా పాప్యులర్ అయింది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8కి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆదివారం అట్టహాసంగా ప్రారంభం కాబోతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షోకు సంబంధించి కీలక అప్టేట్ వచ్చింది. షోలో ఈసారి ఎంత మంది పాల్గొంటున్నారు? ఫస్ట్ ఫేజ్ లో ఎంత మంది లోపలికి వెళతారు? ఎవరెవరు కన్పర్మ్ అవుతారు? అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహగానాలు చెలరేగుతున్నాయి. 

సాధారణంగా బిగ్ బాస్ లో ఎప్పుడూ కూడా 15 మందికి పైగా కంటెస్టెంట్ లు ఉంటారు. అయితే ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఉంటుందని సమాచారం. మొదటి ఫేజ్ లో 14 మందిని పంపిస్తున్నారు. అయితే 15 వారాల షోకి 14 మందిని తీసుకుంటే చాలా మందిని వైల్డ్ కార్డు ద్వారా లోపలికి పంపాల్సి ఉంటుంది. దాదాపు 5 నుంచి 6 మంది హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది.  

ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం ప్రకారం .. తన ఇన్‌స్టా వీడియోల ద్వారా పాప్యులర్ అయిన బెబక్క, హీరో ఆదిత్య ఓం, కృష్ణ ముకుందా మురారి సీరియల్ ద్వారా ఫేమస్ అయిన యష్మి గౌడ, ప్రేరణ కంభం, విష్ణు ప్రియ, అభయ్ నవీన్, ఢీనైనిక, కిర్రాక్ సీత బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తొంది. అలానే శేఖర్ బాషా, నాగమణికంఠ, నిఖిల్ కూడా మంచి పొటెన్షియల్ ఉన్న కంటెస్టెంట్స్ గా భావిస్తున్నారు. 

తొలుత రీతూ చౌదరి, తేజస్విని గౌడ, అంజలి పవన్, ఇంద్రనీల్, కుమారి ఆంటీ, రామిశెట్టి, కిరాక్ ఆర్పీ లు బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్ లుగా ఉంటారని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేశాయి. అయితే వీరు ఎవరూ హౌస్ లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News