SS Rajamouli: సీక్వెల్‌పై అంచ‌నాలు పెంచేశారు బాయ్స్.. రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

SS Rajamouli Tweet on Mathu Vadalar 2 Movie Teaser

  • 'మ‌త్తు వ‌ద‌లరా-2' టీజ‌ర్‌పై ఎక్స్ వేదిక‌గా రాజ‌మౌళి ప్ర‌శంస‌లు
  • టీజ‌ర్‌లో విజువ‌ల్స్, డైలాగ్స్ సూప‌ర్బ్ అన్న జ‌క్క‌న్న‌
  • శ్రీసింహా, రితేశ్ రానా కాంబోలో 'మ‌త్తు వ‌ద‌లరా-2'  
  • సెప్టెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న మూవీ

తాజాగా విడుద‌లైన 'మ‌త్తు వ‌ద‌లరా-2' టీజ‌ర్‌పై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌శంస‌లు కురిపించారు. అబ్బాయిలు అద‌ర‌గొట్టారంటూ రాసుకొచ్చారు. 

టీజ‌ర్‌లో విజువ‌ల్స్, డైలాగ్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయని మెచ్చుకున్నారు. మంచి కామెడీని అందించాయ‌న్నారు. దీంతో సీక్వెల్‌పై అంచ‌నాలు పెంచేశార‌ని తెలిపారు. సెప్టెంబ‌ర్ 13న మూవీ టికెట్లను త‌స్క‌రించేందుకు (టీజ‌ర్‌లోని డైలాగ్‌ను ఉద్దేశిస్తూ) సిద్ధంగా ఉన్నాన‌ని పేర్కొన్నారు. 

అలాగే టీజ‌ర్‌లోని డైలాగ్‌ను గుర్తుచేస్తూ 'హీ హీ హీ.. హీ టీమ్' అంటూ స్మైలీ ఎమోజీల‌ను ఈ పోస్టుకు జోడించారు జ‌క్క‌న్న‌. ఇప్పుడీ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  

కాగా, మూవీలో శ్రీసింహా హీరోగా న‌టించ‌గా, కాల‌భైర‌వ సంగీతం అందించారు. వీరిద్ద‌రూ అస్కార్ అవార్డు గ్ర‌హీత, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి కుమారులు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక రితేశ్ రానా డైరెక్ట్ చేసిన మ‌త్తు వ‌ద‌ల‌రాకు సీక్వెల్‌గా మ‌త్తు వ‌ద‌లరా-2 వ‌స్తోంది. కామెడీ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో 2019లో వ‌చ్చిన మ‌త్తు వ‌ద‌ల‌రా మంచి విజ‌యం అందుకుంది. దాంతో సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 13న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది. 

  • Loading...

More Telugu News