HYD Hospital: హైదరాబాద్ ఆసుపత్రి నిర్వాకం... O పాజిటివ్ రక్తానికి బదులు AB పాజటివ్ రక్తాన్ని ఎక్కించిన వైనం

Doctors transfused different group blood to a woman

  • ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో దారుణ ఘటన
  • వేరే రక్తం ఎక్కించడంతో తీవ్ర అనారోగ్యానికి గురైన మహిళ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన భర్త

హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నంలో ఉన్న ఆసుపత్రిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళకు O పాజిటివ్ రక్తానికి బదులు AB పాజిటివ్ రక్తాన్ని ఎక్కించడంతో ఆమె పరిస్థితి విషమంగా మారింది. ఇబ్రహీంపట్నంలోని లిమ్స్ ఆసుపత్రిలో ఈ నిర్లక్ష్యకర ఘటన చోటు చేసుకుంది. 

మేఘన అనే 23 ఏళ్ల వివాహిత గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. రంగారెడ్డి జిల్లా నోముల గ్రామానికి చెందిన ఈమె లిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈమెకు O పాజిటివ్ బదులు AB పాజిటివ్ రక్తాన్ని ఎక్కించారు. దీంతో, ఆమె ఆరోగ్యం మెరుగవ్వకపోగా... మరింత క్షీణించింది. ఈ పరిస్థితిలో, ఆమెను కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా... అసలైన విషయం బయటపడింది. ఆమెకు O పాజిటివ్ కు బదులుగా AB పాజిటివ్ రక్తం ఎక్కించారని... అందువల్ల ఆమెకు బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని వైద్యులు నిర్ధారించారు. ఈ విషయంతో షాక్ కు గురైన ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News