Ganta Srinivasa Rao: అలా చేసిన‌ వారిని మాత్ర‌మే టీడీపీలోకి ఆహ్వానిస్తున్నాం: ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

Ganta Srinivasa Rao Comments on YSRCP

  • వైసీపీని వీడుతున్న కీల‌క నేత‌లు
  • టీడీపీ, జ‌న‌సేన గూటికి చేరుతున్న వైనం
  • తాజాగా మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు వైసీపీకి గుడ్ బై
  • టీడీపీలో చేర‌బోతున్న‌ట్లు మోపిదేవి ప్ర‌క‌ట‌న‌
  • త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసి టీడీపీలో చేర‌తామంటే స్వాగ‌తిస్తామ‌న్న‌ గంటా

వైసీపీకి కీల‌క నేత‌లు ఒక్కొక్క‌రు గుడ్ బై చెబుతున్నారు. ఆ పార్టీని వీడుతున్న నేత‌లు టీడీపీ, జ‌న‌సేన గూటికి చేరుతున్నారు. తాజాగా రాజ్య‌స‌భ స‌భ్యులు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్ రావు కూడా వైసీపీ పార్టీకి, రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వుల‌కు ఏక‌కాలంలో రాజీనామా చేశారు. మోపిదేవి టీడీపీలో చేర‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు కూడా. ఈ క్ర‌మంలో ఇంకొంద‌రు వైసీపీ నేత‌లు కూడా టీడీపీ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. 

ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ, ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసింద‌ని అన్నారు. ఆ పార్టీని మునిగిపోయిన నావ అని పేర్కొన్నారు. 

అలాగే వైసీపీలో వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌ప్ప ఎవ‌రూ మిగ‌ల‌ర‌ని ఎద్దేవా చేశారు. త‌మ ప‌ద‌వులకు రాజీనామా చేసి టీడీపీలో చేర‌తామంటే స్వాగ‌తిస్తామ‌ని గంటా శ్రీనివాస‌రావు అన్నారు.

  • Loading...

More Telugu News