Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Markets ends in profits

  • ఐటీ రంగంలో అమ్మకాల ఒత్తిడి
  • 33 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్
  • 12 పాయింట్లు పెరిగిన నిఫ్టీ

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మన మార్కెట్లపై ప్రభావం చూపాయి. ఐటీ రంగంలో అమ్మకాలు కూడా సూచీలను ఒత్తిడికి గురి చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్ల లాభంతో 81,086కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 24,823 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (1.53%), సన్ ఫార్మా (1.44%), భారతి ఎయిర్ టెల్ (1.33%), ఐసీఐసీఐ బ్యాంక్ (1.05%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.97%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-1.17%), ఏషియన్ పెయింట్స్ (-0.98%), టైటాన్ (-0.97%), ఇన్ఫోసిస్ (-0.94%), టీసీఎస్ (-0.80%)

Stock Market
Sensex
Nifty
  • Loading...

More Telugu News