Team India: ఇంగ్లండ్ లో టీమిండియా పర్యటన... షెడ్యూల్ ఇదిగో!

team india tour to england 2025 full schedule

  • వచ్చే ఏడాది ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్
  • భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ను విడుదల చేసిన ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు
  • 2025 జూన్ 20 నుండి ఆగస్టు 4 వరకూ

భారత క్రికెట్ జట్టు వచ్చే  ఏడాది జూన్ లో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో తలపడేందుకు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబి)  భారత్ తో ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ ను విడుదల చేసింది. రోహిత్ శర్మ సారథ్యంలో ఇండియా టీమ్ వచ్చే ఏడాది జూన్, ఆగస్టు మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను అడేందుకు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. భారత జట్టు ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుండి ఆగస్టు 4వరకు జరగనుంది. 

భారత్ ఇంగ్లండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇలా

1వ టెస్ట్ : 2025 జూన్ 20 నుండి 24 వరకు లీడ్స్ లోని హెడ్లింగీ మైదానంలో
2వ టెస్ట్ : 2025 జులై 2 నుండి 6వరకు బర్మింగ్ హోమ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో
3వ టెస్ట్ : 2025 జులై 10 నుండి 14వరకు లండన్ లార్డ్స్ క్రీడా మైదానంలో..
4వ టెస్ట్ : 2025 జులై 23 నుండి 27వరకు, మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో
5వ టెస్ట్ : 2025 జులై 31 నుండి ఆగస్టు 4వరకు లండన్ ది ఓవల్ మైదానంలో

  • Loading...

More Telugu News