Nara Bhuvaneswari: ఏపీలో అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari donates Rs 1 crore to Anna Canteens

  • రేపు స్వాతంత్ర్య దినోత్సవం
  • ఏపీలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్న కూటమి ప్రభుత్వం
  • ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున భారీ విరాళం అందించిన నారా భువనేశ్వరి 

ఏపీలో రేపు (ఆగస్టు 15) స్వాంతంత్ర్య దినోత్సవం సందర్భంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.1 కోటి విరాళం అందించారు. తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ తరఫున ఆమె ఈ విరాళం ఇచ్చారు. మంత్రి నారాయణ, అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులకు నారా భువనేశ్వరి విరాళం తాలూకు చెక్ అందించారు.

ఈ సందర్భంగా నారా భువనేశ్వరి స్పందిస్తూ, అన్నపూర్ణ వంటి రాష్ట్రంలో ఆకలి అనే పదం వినిపించకూడదని పేర్కొన్నారు. పేదల ఆకలి తీర్చే మహత్తర కార్యక్రమం అన్న క్యాంటీన్లు అని వివరించారు. 

Nara Bhuvaneswari
Anna Canteens
Donation
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News