Naresh: ఇప్పటిదాకా నేను సారీ చెప్పింది ఆమెకు మాత్రమే: సీనియర్ నటుడు నరేశ్

So far I have only apologized to her Naresh

  • తప్పు బహిరంగంగా ఒప్పుకుంటానని పేర్కొన్న నటుడు నరేశ్
  • జీవితంలో సారీ చెప్పింది తన తల్లికి మాత్రమేనని స్పష్టీకరణ

తన జీవితంలో ఇప్పటి వరకూ సారీ అనేది ఒక్కరికే చెప్పానని ప్రముఖ సినీ నటుడు నరేశ్ అన్నారు. నరేశ్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో అనురాగ్ పాలుట్ల తెరకెక్కించిన సినిమాను వీరాంజనేయ విహార యాత్రను బి.బాపినీడు, సుధీర్ ఈదర కలిసి నిర్మించారు. శ్రీలక్ష్మి, రవితేజ, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 14న ఈటీవీ విన్ లో విడుదల అవుతున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా నటుడు నరేశ్ సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు తన జీవితంలోని కొన్ని విషయాలను పంచుకున్నారు.
 
తన జీవితంలో సారీ అనేది ఎవరికైనా చెప్పి ఉన్నట్లయితే అది తన తల్లికేనని చెప్పారు నరేశ్. తాను మనస్సాక్షిని నమ్ముతానని, నాకు కరెక్ట్ అనిపించిన తర్వాత ఎవరు ఏమి అనుకున్నా తాను తన పని చేసుకుని వెళతానని అన్నారు. మా అమ్మ ఓ సందర్భంలో పిన్ పాయింట్ చేసిందని, అప్పుడు ఆమెపై కోపం వచ్చినా ఆ తర్వాత రియలైజ్ అయి సారీ అని చెప్పడం జరిగిందన్నారు. నాకు తెలిసి అది ఒక్కటేనని అన్నారు. నాది తప్పు ఉంటే బహిరంగంగా ఒప్పుకుంటానని పేర్కొన్నారు. వీరాంజనేయ విహార యాత్ర కామెడీ, భావోద్వేగాల కలయిక అని, ఇది అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.  

  • Loading...

More Telugu News