Sensex: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Nifty and Sensex down after RBI keep rates unchanged

  • 582 పాయింట్ల నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్
  • ఆర్బీఐ ప్రకటన సమయంలోనే కాసేపు లాభాల్లో కనిపించిన స్టాక్స్
  • అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను స్థిరంగా కొనసాగించడంతో ఉదయం లాభాల్లో కనిపించిన మార్కెట్లు... ఆ తర్వాత క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 582 పాయింట్లు నష్టపోయి 78,886 పాయింట్ల వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు పడిపోయి 24,117 పాయింట్ల వద్ద ముగిసింది. 

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల నేపథ్యంలో భారత మార్కెట్లు ప్రారంభంలో మినహా రోజంతా నష్టాల్లోనే ఊగిసలాడాయి. ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటన చేసిన సమయంలోనే కాసేపు లాభాల్లో కనిపించాయి.

బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే బెంచ్ మార్క్ సెన్సెక్స్ కంటే వాటి క్షీణత తక్కువగానే ఉంది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.44 శాతం క్షీణించగా, స్మాల్ క్యాప్ 0.16 శాతం పడిపోయింది.

బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్ కంటే దాదాపు రూ.3 లక్షల కోట్ల మేర తగ్గింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నిన్న రూ.448.6 లక్షల కోట్లు ఉండగా, ఈ రోజు రూ.445.8 లక్షల కోట్లకు తగ్గింది.

నిఫ్టీ 50లో 41 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. మైండ్ ట్రీ, గ్రాసీమ్, ఏషియన్ పేయింట్స్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. టాటా మోటార్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీలు భారీ లాభాల్లో ముగిశాయి.

  • Loading...

More Telugu News