Revanth Reddy: రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ

CM Revanth Reddy meets trigyn technologies officials

  • హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన కంపెనీ
  • మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు వెల్లడి
  • హైదరాబాద్‌లో కార్యకలాపాలు విస్తరించనున్న ఆర్సీయమ్ కంపెనీ

అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో ట్రైజీన్ టెక్నాలజీస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని ఏఐ సెంటర్ ఏర్పాటుకు ఈ కంపెనీ ముందుకు వచ్చింది. మూడేళ్లలో వెయ్యికి పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ఆర్సీయమ్ కంపెనీ వెల్లడంచింది. కంపెనీ సీఈవో గౌరవ్ సూరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలిశారు. ఈ సందర్భంగా కంపెనీని విస్తరిస్తానని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News