Somalia: సోమాలియాలో ఉగ్రదాడి... 32 మంది మృతి

Terror attack in Somalia leaves 32 dead

  • హోటల్ పై ఆత్మాహుతి దాడి
  • చెల్లాచెదురుగా మృతదేహాలు
  • కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా బలగాలు
  • దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించిన అల్ ఖైదా అనుబంధ సంస్థ

ఆఫ్రికా ఖండంలోని అత్యంత పేద, కల్లోలభరిత దేశాల్లో ఒకటైన సోమాలియాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఓ హోటల్ పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 32 మంది మరణించారు. మరో 63 మందికి గాయాలయ్యాయి. ఈ ఉగ్రదాడికి తామే బాధ్యులమంటూ అల్ ఖైదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ ప్రకటించింది. 

సోమాలియా రాజధాని మొగదిషు నగరంలోని లిడో బీచ్ కు సమీపంలో ఉన్న ఈ హోటల్ పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు వంటినిండా పేలుడు పదార్థాలు అమర్చుకుని తనను తాను పేల్చుకున్నాడు. భద్రతా బలగాలు స్పందించి కాల్పులు జరగడంతో నలుగురు సాయుధ ఉగ్రవాదులు మరణించారు. మరో ఉగ్రవాదిని సజీవంగా పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News