Nitin Gadkari: ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు నితిన్ గడ్కరీ శుభవార్త

Nitin Gadkari okayed for foot over bridge at Tekumatla

  • టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ఫ్లైఓవర్‌ను మంజూరు చేసిన కేంద్రమంత్రి
  • ఇటీవల కేంద్రమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ ఎంపీ రవిచంద్ర
  • ఎంపీ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి

ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనదారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభవార్త చెప్పారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై టేకుమట్ల-రాయినిగూడ మధ్యలో ప్లైఓవర్ మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇటీవల కేంద్రమంత్రి గడ్కరీని కలిసి... ఈ ఫ్లైఓవర్ కోసం విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే 65పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ మార్గంలో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టేకుమట్ల ప్రాంతంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు హైవేపై ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మరోవైపు, హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో పలుచోట్ల ఫ్లైఓవర్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఆ దిశగా టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభించాలని నిర్ణయించింది.

  • Loading...

More Telugu News